సూర్యాపేట, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు.
సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని జమ్మిగడ్డ, గోపాలపురం, విజయకాలనీ, తాళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ముస్లింలకు తోఫా కిట్లను అందజేశారు. సుమారు కోటి రూపాయలతో పది రకాల సామగ్రితో తయారు చేయించిన కిట్ల పంపిణీని మంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.