సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వారిపాత్ర కీలమని చెప్పారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆశాలను గుర్తించిది దేశంలో తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఆశా కార్యకర్తలు జీతంకోసం గతంలో పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని.. సీఎం కేసీఆర్ మాత్రం వారి జీతాలను రూ.9750కి పెంచారన్నారు.
కరోనా పరీక్షలు, గర్భిణీలకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపర్చడానికి ఆశా కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం వైద్య రంగంలో మంచి పరిణామం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1070 మందికి స్మార్ట్ఫోన్లు ఇవ్వగా, రాష్ట్రంలో 27 వేల మంది ఆశాలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నామని తెలిపారు.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆశా వర్కర్లకు రూ.4వేలు వేతనమే ఇస్తుండగా, మన రాష్ట్రంలో రూ.9750 అందిస్తున్నామని చెప్పారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలు బాగా పనిచేశారని కొనియాడారు. ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజారోగ్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రధాని మోదీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందని ఎద్దేవాచేశారు.