హైదరాబాద్ : మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసి, 17 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మాజీ మావోయిస్టు(former maoist) గజ్జల సత్యం రెడ్డి జనజీవన స్రవంతిలోకి రావడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి(Ministe Jagadish reddy) అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రిని సత్యంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు .
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన ఉద్యమం అనుభవాలు,రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను మంత్రి ఆయనకు వివరించారు. అటువంటి తెలంగాణా పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని సత్యం రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత నామిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భారీ మార్పు : మాజీ మావోయిస్టు
తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత రాష్ట్రంలో భారీ మార్పు సంభవించిందని మాజీ మావోయిస్టు సత్యం రెడ్డి అన్నారు. ఉద్యమంలోకి వెళ్లేముందు ఉన్న తెలంగాణకు ఇప్పటి తెలంగాణ కు అసలు పోలికే లేదని చెప్పారు. అన్ని రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఉద్యమం లో ఉన్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు చూశానని ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఆయా రాష్ట్రాలలో లేదని ఆయన అన్నారు.