హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి.. వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని తెలిపా రు. పీఆర్సీ ప్రకటించాలని కోరుతూ తెలంగాణ వి ద్యుత్తు ఉద్యోగుల జేఏసీ (టీఈఈజేఏసీ) నేతలు శనివారం మింట్ కంపౌండ్లోని మంత్రి కార్యాలయం లో జగదీశ్రెడ్డితోపాటు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎం డీ జీ రఘుమారెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
పీఆర్సీ సహా ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను సైతం పరిష్కరించాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రికి జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ ఎన్ శివాజీ, వైస్ చైర్మన్ పాపకంటి అంజయ్య, ప్రతినిధులు నాజర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, గణేశ్, జా న్సన్, ఆరోగ్యరాణి, శ్రీకర్ తదితరులు ఉన్నారు.