సూర్యాపేట: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు 2014లో సూర్యాపేటలో మొదలు పెట్టిన అభివృద్ధి యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి తన లక్ష్య సాధనలో మరో అడుగు వేశారు. ఇందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు 2 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మూడు పార్కులు, సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.
9వ వార్డ్ అంబేద్కర్ నగర్లో రూ.14 లక్షలు, 27వ వార్డ్ పరిధిలోని ఆర్. కె గార్డెన్స్ వద్ద రూ.40 లక్షలు ,13వ వార్డ్ అంజనపురి కాలనీలో రూ.45 లక్షల అంచనాలతో సి.సి రహదారులతో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సద్దుల చెరువు సమీపంలో రూ.50 లక్షలు, 8 వార్డ్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో రూ.50 లక్షలు, కృష్ణా టాకీస్, ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన పార్కుల నిర్మాణాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, పట్టణ టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాల సైదులు గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి గౌడ్, లక్ష్మీ కాంతమ్మ, ఆకుల లవకుశ, కడారీ సతీశ్ యాదవ్, వట్టే రేణుక మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి వై.వి, టీఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, బైరు వెంకన్న, చనగాని రాంబాబు గౌడ్, కక్కి రేణి నాగయ్య, మహిళా అధ్యక్షురాలు కరుణ, సల్మా, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.