నిర్మల్: జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీజీ 153వ జయంతి సందర్భంగా మహాత్మునికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తూ.. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, తదితరులు పాల్గొన్నారు.