నిర్మల్ : ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పాల్గొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుదన్నారు. పర్యావరణ మార్పుల నుంచి భూమిని రక్షించేందుకు ప్రస్తుతానికి ఉన్న అడవులను కాపాడుకుంటూ మొక్కలు పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కృషిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.