నిర్మల్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. శాంతి కపోతాన్ని, త్రివర్ణపు బెలున్లను గాల్లోకి ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు జాతీయ జెండాలు చేతబట్టుకుని.. నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈ రోజు చారిత్రాత్మక సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మిరెడ్డి, కలెక్టర్ ముశ్రరఫ్ పారూఖీ అలీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.