ఆదిలాబాద్: తెలంగాణలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకునేలా తెలంగాణ సర్కారు సాయం అందిస్తున్నది రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మ్ల జిల్లాలో ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన ఇఫ్తార్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అందరూ కలిసి, మెలిసి ఉంటున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నారని వెల్లడించారు.