హైదరాబాద్ : బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వర్ణం సాధించిన పీవీ సింధు ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.
కామన్వెల్త్ క్రీడల్లో షట్లర్ పీవీ సింధు, యువ బాక్సర్ నిఖత్ జరీన్ లు తమ సత్తా చాటి పసిడి పతకాలు గెలవడం దేశానికి గర్వ కారణమని అన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించిన అందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.