నిర్మల్ : తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను, ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో కలిసి పని చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా జయశంకర్ చరిత్రలో చిరస్మరణీంగా నిలిచిపోతారన్నారు.
తెలంగాణ సమాజం జయశంకర్ సార్ ను ఎప్పటికి మరువబోదన్నారు. అలాగే త్వరలో దివంగత మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని నిర్మల్ పట్టణంలో ప్రతిష్టిస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు