నిర్మల్ : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ ఏవిధంగా అమలవుతున్నాయో ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సిన వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలన్నారు. లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఉచితంగా చికిత్సకు అవసరమైన మందులు ఇస్తుందని పేర్కొన్నారు.
అనంతరం నిర్మల్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పోలీస్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
తెలంగాణ లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు