Huzurabad | హుజూరాబాద్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్ తమకు ఎలాంటి పనులూ చేయలేదని స్థానిక ప్రజలు మంత్రి హరీశ్రావుతో మొరపెట్టుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన పలు గ్రామాల్లో పర్యటించగా ప్రజలు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఇకనుంచి హుజూరాబాద్లో అభివృద్ధి జెట్ స్పీడ్తో పరిగెట్టాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించండి. ఆ తర్వాత అభివృద్ధి అనే బరువు, బాధ్యతలను నాపైన వేయండి అని భరోసా ఇచ్చారు. దీంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మహిళలు మంత్రితో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.