Minister Harish Rao | సిద్దిపేట : కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడడం లేదని, పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదని నిలదీశారు. ఇందులో ఏమైనా తప్పుందా? అని నిలదీశారు. తాను ప్రజల పక్షాన మాట్లాడానని, ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పానన్నారు.
ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలని చెప్పానన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తెలంగాణలో అన్ని బాగున్నాయని.. ఇక్కడే ఉండండి అనీ, ఆ రోజు అన్నానన్నారు. కానీ ప్రజల్ని, ఏపీని కించ పరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు అనడం, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలాడుతున్నారని విమర్శించారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరంలా నీళ్లు అందించాలన్నారు.