హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులైన హరీశ్రావుకు ఆహ్వానం అందింది. కరోనా కాలంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు వర్చువల్ విధానంలో జరిగిన విషయం తెలిసిందే.