Minister Harish Rao | తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న హరీశ్రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇవాళ ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.