హైదరాబాద్ : కరోనా మహమ్మారి బారిన పడ్డ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. వీరిద్దరూ త్వరగా కోలుకుంటారన్న నమ్మకం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఆకాంక్షించారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో కొవిడ్ను జయించి, సంపూర్ణ ఆరోగ్యంతో కేటీఆర్ ప్రజా సేవ చేయాలని పేర్కొన్నారు.