హైదరాబాద్ : బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ అందిస్తుంటే.. తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రీషన్ అందజేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుందని, అందుకే అందుకే తల్లీ బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు ప్రారంభిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కేసీఆర్ న్యూటిషన్ కిట్ను ప్రారంభించనున్నామని, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్తో పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనున్నారు. మాతా శిశు సంరక్షణ కోసం మనం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. కామారెడ్డి నుంచి మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభిస్తారు. మొదట తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు కేసీఆర్ కిట్లను పంపిణీ ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశపెట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నది. 16 నుంచి 24వారాలు (రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు కిట్కు అర్హులు. ఒక్కో కిట్లో ఆరకిలో నెయ్యి. కిలో ఖర్జూర పండ్లు, ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్ బాటిల్స్, ఇతర పోషక పదార్థాలు ఈ కిట్లో ఉండనున్నాయి.
బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్,
తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్.తల్లి బాగుంటే ఇళ్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది.అందుకే తల్లీ బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి,విజయవంతంగా అమలు చేస్తున్నారు pic.twitter.com/753SOTcGv3
— Harish Rao Thanneeru (@trsharish) December 20, 2022