Minister Harish Rao | ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. పరిపాలన పగ్గాలు చేపట్టి.. ప్రగతి పథంలో దూసుకుపోతుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న అధికార పార్టీ.. దేశాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. ఆ అడుగులో భాగంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.
నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం.. కేంద్ర మంత్రులు.. నీతి ఆయోగ్లు దేశానికి రోల్ మోడల్, ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు అని హరీశ్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
రాష్ట్రం సాధించి అనేక రంగాల్లో అద్భుతమైన విజయం సాధించినట్లు గానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి.. దేశంలో మార్పు తేవాలి అని సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞము ఇది. దేశ రాజకీయాల్లో మనం పోవాలని బీఆర్ఎస్ పార్టీగా పేరు మారుస్తూ గత అక్టోబర్ నెలలో విజయ దశమి పర్వదినాన బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును దృవీకరించడం సంతోషకరం.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకుందాం.. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దాం అని హరీశ్రావు పిలుపునిచ్చారు.
నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష..
నేడు స్వదేశ స్వావలంబన…
కేసీఆర్ గారి సారథ్యంలో నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
1/4 pic.twitter.com/ys4pe3JMtp— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2022