హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): సంఘ సంస్కర్త, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ మార్గదర్శనంలో తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. బాబాసాహెబ్ ముందుచూపు, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపికను సీఎం కేసీఆర్ నిర్మించారని తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణంతో అంబేద్కర్ భావజాలంపై కేసీఆర్ తనకు ఉన్న అంకితభావాన్ని చాటారని చెప్పారు. అందరికీ సమానత్వం కోసం మరింతగా శ్రమిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.