హైదరాబాద్: మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఘన నివాళి అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచారని అన్నారు. నిజాం పాలన మీదికి ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి అని, పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్నారని.. ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళి..
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళి..
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. pic.twitter.com/hjBQrtt0tR— Harish Rao Thanneeru (@trsharish) July 22, 2022