సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు. అక్కడే ఉన్న రైతులను ధరణి పోర్టల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధరణి ద్వారా 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి.. హక్కు పత్రాలు చేతికి వస్తున్నాయని, మ్యూటేషన్ ఇబ్బందులు తప్పాయని రైతులు తెలిపారు. ధరణి తమకు ప్రయజనకరంగా ఉందని స్పష్టం చేశారు.