సంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో 3 గంటల కరెంటే ఇస్తున్నారని, సెల్ఫోన్ చార్జింగ్కు కూడా కరెంట్ ఉండటం లేదని ఆ రాష్ట్ర ప్రజల బాధలు కళ్లారా చూసిన జహీరాబాద్వాసులు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలను మంత్రి హరీశ్రావు ఎదుట ఏకరువు పెట్టారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్రావు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొణింటి మాణిక్రావుతో కలిసి జహీరాబాద్లోని బసవ ఫంక్షన్హాల్లో కుల సంఘాల పెద్దలతో సమావేశయ్యారు. న్యాల్కల్ మండలం హద్నూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటకతో చుట్టరికం, స్నేహబంధం ఉన్నవారితో ఆసక్తికరంగా సంభాషించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కర్ణాటక తరహా కటిక చీకట్లు కావాల్నా? కట్క వేస్తే వచ్చే కరెంటు కావాల్నా? అని ప్రశ్నించారు. స్థానికంగా అందుబాటులో ఉండే మాణిక్రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్, దేవీప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు నరోత్తం, తన్వీర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు ఉమకాంత్పాటిల్, గుండప్ప, వీరారెడ్డి పాల్గొన్నారు.
కర్ణాటక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
కర్ణాటకలో సెల్ఫోన్ చార్జింగ్ పెట్టుకుందామన్నా కరెంటు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బూచనెల్లి గ్రామానికి చెందిన మల్లేశం హద్నూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు ఎదుట ఏకరువు పెట్టారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా..
మంత్రి హరీశ్రావు : బ్రదర్ నీ పేరేంది? కర్ణాటక వాళ్ల గురించి ఏమో చెప్తున్నవ్?
మల్లేశం: సర్ నా పేరు మల్లేశం. నాది పక్కనే బూచనెల్లి. మహీంద్రా అనుబంధ పరిశ్రమలో పనిచేస్తున్నా. అందులో సగం మంది కర్ణాటక వాళ్లు ఉన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోవద్దని మాకు చెప్తున్నారు.
మంత్రి హరీశ్రావు : కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్లు కాంగ్రెస్కు ఓటు వేయొవద్దని చెప్తున్నారా? వారి పేర్లేంటి?
మల్లేశం: కర్ణాటకల వాళ్లు నా దోస్తులు సర్. ఒకరు బాపురెడ్డి, మరొకరు ఉమేశ్.
మంత్రి హరీశ్రావు : కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయద్దు అంటున్నారు?
మల్లేశం: వాళ్లకు 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పారంట. ఇప్పుడు మూడు గంటల కరెంటు కూడా ఉండటం లేదంట. కరెంటు గురించి అడిగితే కేంద్రంలో రాహుల్గెలిస్తే ఫుల్ కరెంటు ఇస్తామని చెప్తున్నారట.
మంత్రి హరీశ్రావు : కర్ణాటకలో కరెంటు కష్టాలు అంతటా ఉన్నాయా?
మల్లేశం: అవును సర్. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి ఐదు గంటల కరెంటు ఇచ్చారు. అదీ రాత్రివేళ్లల్లో మూడు గంటల కరెంటు ఇచ్చేవారు. ప్రస్తుతం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు వస్తున్నది. ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. లేదంటే సముద్రంలో పడతామంటే కాంగ్రెస్కు ఓటు వేయండి. పచ్చని పంటలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఓటు వేయండి.
మంత్రి హరీశ్రావు : మల్లేశం ముచ్చట మనసునపట్టింది. మల్లేశం మాట విన్న ఎవ్వరూ కాంగ్రెస్కు ఓటు వేయరు. కాంగ్రెస్కు ఓటు వేసి ఎవ్వరూ మోసపోకండి.
కర్ణాటకలో ట్రాన్స్ఫార్మర్ కాలితే అంతే!
కర్ణాటకలో ట్రాన్స్ఫార్మర్ కాలితే అంతేనని, దాన్ని మార్చేందుకు 30 రోజులైనా పడుతుందని మెటల్కుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాజేందర్రెడ్డి తెలిపారు. తన అత్తగారిది కర్ణాటక అని, అక్కడి బాధలను ప్రత్యక్షంగా అనుభవించానని హరీశ్రావుతో చెప్పారు.
వారివురి మధ్య జరిగిన సంభాషణ ఇలా..
రాజేందర్రెడ్డి: సర్ హుమ్నాబాద్ తాలూకాలోని ముస్తర్వాడి మా అత్తగారి ఊరు
మంత్రి హరీశ్రావు : మీ మామ పేరు ఏమిటి, మీ భార్య పేరు ఏమిటి?
రాజేందర్రెడ్డి: మా మామ పేరు హన్మంత్రెడ్డి. మా భార్య పేరు సరిత.
మంత్రి హరీశ్రావు: అత్తగారి ఇంటికిపోతే అక్కడ ఏమైంది చెప్పు?
రాజేందర్రెడ్డి: సర్ ఈ మధ్యనే మా అత్తగారి ఇంటికి వెళ్లాను. అక్కడ కరెంటు సమస్య ఎక్కువగా ఉంది. కరెంటు గురించి అడిగితే ప్రజలు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉండగా 7 గంటల కరెంటు ఇచ్చేవారట. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు ఇస్తున్నారట. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే నెలకు మారుస్తారట సర్. పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు ఏవీ అమలు కావడం లేదట.
మంత్రి హరీశ్రావు : మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో మారుస్తాం. 24 గంటల కరెంట్ ఇస్తాం. 24 గంటల కరెంట్ కావాలి అనేవారు బీఆర్ఎస్కు, ఐదు గంటల కరెంట్ కావాలి అనేవాళ్లు కాంగ్రెస్కు ఓటు వేయండి
జనం : సర్ మాకు 24 గంటల కరెంటు కావాలి, మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం..