Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మెదక్ జిల్లా కుల్చారం సమీపంలో టైర్ పేలడంతో ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో దంపతులకు ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఈ సమయంలో మెదక్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్కు వస్తున్న మంత్రి హరీశ్రావు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ని ఆపారు. దంపతుల వద్దకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించి, దంపతులిద్దరికి ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయించి, ఇంటి వద్దకు చేర్చాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.