Harish Rao | శ్రీ రామ నవమి( Sri Rama Navami ) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish rao ) రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. శ్రీ రాముడు( Sri Ramudu ) కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామున్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలన్నారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, శ్రీ రాముని అనుగ్రహముతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు( Welfare Schemes ) ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని, నేడు మండుటెండల్లో కూడా చెరువులు, చెక్ డ్యామ్లు మత్తళ్ళు దుంకుతున్నాయని పేర్కొన్నారు. రైతులు( farmers ) రెండు పంటలు పండించి సంతోషంగా ఉండటం సంతృప్తిని ఇచ్చిందన్నారు. సిద్దిపేట( Siddipeta ) ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని.. ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి హరీశ్రావు కోరుకున్నారు.