Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ) అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, ప్రతి రోగి( Patients ) పట్ల ప్రేమను, మమకారాన్ని పంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సూచించారు. నిమ్స్లో కొత్తగా నియామకమైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు( Asst Professors ) నియామక పత్రాలను మంత్రి హరీశ్రావు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగంలో చేరడంలో ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. నిమ్స్లో పని చేయడం అంటే.. ఇక్కడ చేయగలిగినన్నీ కేసులో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయలేరు. ఇక్కడే పీజీ చేసి ఇక్కడే ఉద్యోగం పొందడం చాలా సంతోషం. మీకు ఇప్పటికే ఈ హాస్పిటల్పై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. నిమ్స్లో ఫస్ట్ టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వుమెన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంత వరకు నిమ్స్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండేది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేశాం అని మంత్రి హరీశ్రావు తెలిపారు.
నిమ్స్కు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు.. అలాంటి వారికి మంచి వైద్యం ఇవ్వాలని కోరుతున్నాను అని హరీశ్రావు తెలిపారు. రోగుల పట్ల ప్రేమను చూపించండి.. మమకారాన్ని పంచండి.. ఆప్యాయతతో పలుకరించండి.. అది రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధైర్యాన్ని పెంచుతుంది. నిమ్స్ అంటే రోగులకు నమ్మకం. విశ్వాసాన్ని పెంచుదాం. విశ్వసనీయతను నిలబెట్టుకుందాం అని హరీశ్రావు అన్నారు.
90 శాతం పేదవారే నిమ్స్కు వస్తుంటారు. ఆరోగ్యశ్రీ కింద కూడా వైద్యం చేయించుకుంటారు అని హరీశ్రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ అందించేం వైద్యం నిమ్స్లో మాత్రమే ఉంది. అందుకే రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లె నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి రోగులకు నిమ్స్ పట్ల ఉండే నమ్మకాన్ని కాపాడాలి. బాగా పని చేసే వైద్యులకు ప్రోత్సాహకాలు పెంచుతాం. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టుకోకుండా, టీమ్ వర్క్గా పని చేయాలి. ప్రభుత్వం, ప్రజల కోసం పని చేయాలని సూచించారు. అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి.. వాటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తున్నాం అని మంత్రి హరీశ్రావు తెలిపారు.