Harish Rao | వికారాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్( Vikarabad ), తాండూర్( Tanduru )కు కృష్ణా జలాలు( Krishna Water ) తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) స్పష్టం చేశారు. పాలమూరు పంప్ హౌస్ పనులు దగ్గర పడ్డాయన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల నుంచి వికారాబాద్, తాండూర్కు కాల్వల ద్వారా నీళ్లను తీసుకువస్తామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు హరీశ్రావు తెలిపారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మనలాంటి పథకాలు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ది అని పేర్కొన్నారు. మన తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్లు వస్తున్నాయి. ప్రతి ఇంటికి కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలు అందుతున్నాయి. పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోలిలో ఇవన్నీ వస్తున్నాయా? అని అడిగారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడ్డారని హరీశ్రావు గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాలు బంద్ అవుతాయన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డు అభివృద్ధి కోసం రూ. 10 కోట్ల మంజూరుకు కేసీఆర్తో మాట్లాడుతానని తెలిపారు.
రాష్ట్రంలోని గర్బిణీలకు న్యూట్రిషన్ కిట్స్ను ఈ నెల నుంచే అందజేస్తామని హరీశ్రావు ప్రకటించారు. రాష్ట్రంలో 3 ఆయుష్ ఆస్పత్రులు మంజూరయ్యాయి. అందులో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పట్టుదలతో వికారాబాద్కు ఒకటి వచ్చిందన్నారు. మూడో సారి కేసీఆర్ను గెలిపించి ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.