సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ(Congress party)ది 42 పేజీల మ్యానిఫెస్టో (Manifesto)కాదు 420 మ్యానిఫెస్టో..అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ఆ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao ) అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎలాగూ గెలిచేది లేదని ఆచరణ సాధ్యం కాని హామీలతో..పేజీలకు పేజీలు రాశారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని విమర్శించారు.
కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నాం. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు.
420 మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చింది. జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్నదా? అని ప్రశ్నించారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవే. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆరోపించారు.
అప్పులు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా ఈటల రాజేందర్. రెండేళ్లు అరోగ్య మంత్రిగా చేశావ్. అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్. గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసావా.. ఓట్ల కోసం ఝూటా మాటలు మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన కేసీఆర్ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.