సంగారెడ్డి : కూర్చున్న కొమ్మను నరికితే ఇబ్బంది పడతాం, ఇన్నేండ్లు కాంగ్రెస్కు ఓటేస్తే చేసింది ఏమీ లేదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇన్చార్జీల సమావేశానిక హాజరైన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంత మంచి ప్రభుత్వం ఉండగా రిస్క్ ఎందుకు. 11 సార్లు ఓట్లు వేస్తే కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. సంగారెడ్డి జిల్లా కూడా చేయలేదు. రైతు బంధు కూడా ఇవ్వలేదన్నారు.
కర్ణాటక నుంచి శివకుమార్ వచ్చి అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ఒప్పుకున్నడు. మన నెత్తి మీద పాలు పోసిండన్నారు. చిన్న పొరపాట్లు ఉంటే సవరించుకోవాలి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగల బెట్టుకోవద్దు. కేసీఆర్ సీఎంగా ఉండాలంటే ఇక్కడ గులాబీ జెండా ఎగరాలన్నారు. పండిన మొత్తం పంటను గింజ లేకుండా ఊరూరా కాంటా పెట్టీ కొనుగొలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో మందికి రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి ఇస్తున్నది. ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 10 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్, ఒకటే లీడర్. 32 మంది సీఎం అభ్యర్థులు కాంగ్రెస్ లో ఉన్నరు. అయితే అలుగుడు లేదంటే గులుగుడు వాళ్లది. మన చంటి లోకల్. మనకు అందుబాటులో ఉంటారు. చంటి క్రాంతి కిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.