హైదరాబాద్ : మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు నమోదుకాలేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లు తెలిపారు.