మంచిర్యాల : పుట్టింది పొరుగున.. పురుడు తెలంగాణలో శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. మహారాష్ట్ర ఆడబిడ్డలు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా వచ్చే వారు యేటా వేల సంఖ్యలో ఉంటున్నారు. ఈ వివరాలతో గత ఐదేళ్లుగా జరిగిన ప్రసవాలపై కథనం ప్రచురితమైంది.
ఈ వార్త క్లిప్పింగ్ను ట్విట్టర్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ షేర్ చేస్తూ.. మహారాష్ట్ర అడబిడ్డలకు మన రాష్ట్రం పుట్టినిల్లు.. సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్టు పథకం అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్రావు .. గాంధీ ట్వీట్ను రీ ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర ఆడబిడ్డలకు మన రాష్ట్రం పుట్టినిల్లు..
సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్లు లాంటి పథకాలు.#KCRKit #Telangana @trsharish @KTRTRS @trspartyonline @DrRanjithReddy pic.twitter.com/WaL5uLJlax
— Gandhi Arekapudi (@GandhiArekapudi) November 9, 2022