హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ను హరీశ్రావు చదివి వినిపిస్తున్నారు. సభలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.