మోకీలు మార్పిడి చికిత్సపై మంత్రి హరీశ్రావు అభినందన
వేములవాడ, మే 29: మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు.
ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. మున్ముందు మరిన్ని అరుదైన ఆపరేషన్లు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావు అభినందించడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.