శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు వెళ్లేముందు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిశారు. బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్కు అందజేసి, ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) / బంజారాహిల్స్: తెలంగాణ బడ్జెట్ ప్రతులకు జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆర్థిక శాఖ మ్ంర తి హరీశ్రావు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంలో భాగంగా హరీశ్రావు సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించారు. బడ్జెట్ పత్రాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావును చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్కు బడ్జెట్ పత్రాలను అందించి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నా రు. బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్రావును అసెంబ్లీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అభినందించారు.
కేసీఆర్కు స్వాగతం..
అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బడ్జెట్లో బీసీ, ఎస్సీ ఇతర వర్గాలకు భారీగా నిధులు కేటాయించినందుకు సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.