హైదరాబాద్ : తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు భాషా పండితుడిగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలను మరువలేనివన్నారు.
కె.కె.రంగనాథాచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించాడన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు లాంటి ఎన్నో రచనలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి