హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చార్మినార్ యునానీ దవాఖానలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదటి డోసును స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ అంజద్ ఖాన్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. గతంలో తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్తోనే వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
రాష్ట్రంలో మొత్తం 41.60 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో 8.32 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. వీరందరికీ బూస్టర్డోస్ వేయనున్నారు. అదేవిధంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు కలిపి రాష్ట్రంలో 6.34 లక్షల మంది ఉన్నారు.