Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే పలు 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, త్వరలోనే యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలో తెలంగాణలో మరో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు 81వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. యాదాద్రి దేవాలయం నిర్మాణం చరిత్రలో అద్భుతంగా చేపట్టామన్నారు. రైతుబంధు కింద రూ.60కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రతి రరోజూ రూ.40-50కోట్లతో విద్యుత్ను కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పత్రి గర్భిణికి రెండు దఫాలుగా న్యూట్రిషన్ కిట్ను అందిస్తున్నామని, రైతుల మోటార్లకు మీటర్లు బిగించకుండా ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు.