Minister Harish Rao | దక్షిణాది నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది దక్షిణ భారతం కథ. దక్షిణాది నుంచి బీజేపీ పతనం మొదలైంది. అన్నిచోట్లా బీజేపీ అకౌంట్ ముగుస్తుంది. తెలంగాణలో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కువు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 9న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శనివారం వెలువడిన ఫలితాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ గెలువగా.. అధికార బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీయూ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు.