Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా’ అన్న తరహాలో ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్కు ఓట్లు పడతాయనే గ్యారంటీనే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సభ ఆసాంతం అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. ఆత్మ వంచన , పరనిందగా సాగిందని విమర్శించారు. ‘గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం’ అన్నట్టుగా హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చింది వారంటీలు లేని గ్యారెంటీలని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటకలో మీరు ఇట్లనే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగమాగం అవుతున్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారు. చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. అకడ మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా? ఏరుదాటాక తెప్ప తగలబెట్టేరకం మీరు’ అని మండిపడ్డారు.
రాహుల్.. అవగాహన పెంచుకో
‘రాహుల్గాంధీ మీ అజ్ఞానానికి జోహార్లు’ అని మంత్రి హరీశ్ విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని, కావాలంటే పేపర్లు తిరగేసి చూడాలని హితవు పలికారు. తాము యశ్వంత్సిన్హాకు మద్దతు ఇచ్చామని, బాజాప్తా ఆయనకే బీఆర్ఎస్ ఓటేసిందని స్పష్టం చేశారు. తెలంగాణాకు యశ్వంత్సిన్హాను పిలిచి భారీ సభ పెట్టామని గుర్తుచేశారు. కావాలంటే కాంగ్రెస్ నేతలనే అడిగి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాము బీజేపీకి మద్దతు ఇవ్వలేదని తెలిపారు. ‘జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంలేదా? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉన్నదా.. లేదా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? ఎందుకీ నయవంచక ముచ్చట్లు’ అని మండిపడ్డారు. ఎవరు ఎవరితో కుమ్మకయ్యారో ప్రజలకు తెలుసని అన్నారు. ‘గుజరాత్ ఎన్నికలపుడు నీ జోడో యాత్ర ఆ రాష్ర్టానికి ఎందుకు వెళ్లలేదు? మా దగ్గర హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి సపోర్టు చేయడం మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. ‘ఈడీ, సీబీఐలు వేటకుకల్లా మా నేతలను వేధిస్తున్నాయి.
నీకు కనిపిస్తలేదా? మా మంత్రులు మల్లారెడ్డి, తలసాని, గంగుల, పువ్వాడ, ఎమ్మెల్సీలు కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులపై ఈడీ, సీబీఐల పేరుతో వేధించినది మీకు కనిపిస్తలేదా? మీకు సంబంధించిన నేషనల్ హె రాల్డ్ కేసు ఎందుకు అటకెకిందో చెప్పగలరా? రాబర్ట్ వాద్రా కంపెనీల అక్రమాలపై బీజేపీ సరారు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ నేతపై కూడా ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు?’ అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ కావడం ప్రపంచానికి తెల్సిన విషయమేనని అన్నారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రకలు ఏరినట్టుందని ఎద్దేవా చేశారు. ‘మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే.. వేలున్నాయి. సాంల సంసృతిని ప్రవేశపెట్టిందే మీరు. మీది కాంగ్రెస్ కాదు.. సాంగ్రెస్ . బోఫోర్స్ నుంచి దాణా, చకెర కుంభకోణాల దాకా.. ఒకటా.. రెండా.. దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రెస్సే మీరు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్లో కుంభకోణమే కనిపిస్తుంది. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటది’ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, ప్రజలు పోరాడి గెలుచుకున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దయతోనే తెలంగాణ వచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీడబ్ల్యూసీలో ఎందుకు తీర్మానం చేయలేదు
‘మీది జాతీయ పార్టీనా .. ప్రాంతీయ పార్టీనా? రాష్ట్రానికో మ్యానిఫెస్టో ఎందుకు..? హైదరాబాద్లో చెప్పిన గ్యారెంటీలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు?’ అని మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు వచ్చి, నోటికి వచ్చింది చెప్పుడే తప్ప కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరని నిలదీశారు. కాంగ్రెస్ 2014లో ఇలాగే బూటకపు హామీలు ఇస్తే 44 ఎంపీ సీట్లే వచ్చాయని, 2019లో 52 మాత్రమే గెలుచుకున్నారని గుర్తు చేశారు.
గ్యారెంటీ లేని పార్టీని ప్రజలు నమ్మరు: సతీశ్రెడ్డి
తుకుగూడ సభలో కాం గ్రెస్ ఇచ్చిన హా మీలు చూస్తే స చ్చిపోయిన బ ర్రె పగిలిపోయి న బుడ్డెడు పాలిచ్చేది అన్నట్టుగా ఉం దని తెలంగాణ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. గ్యారెంటీ లేని పార్టీ ఇ చ్చే గ్యారెంటీలను ప్రజలను నమ్మరని ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్కు తెలంగాణలో గెలుపు గ్యారెంటీ లేదని చెప్పారు. తెలంగాణలో గుప్పించిన హామీలను కాంగ్రెస్ పాలిత రా ష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశించారు. బూటకపు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజల గొంతు కో యాలని చూస్తే ఊరుకోవడానికి ప్రజ లు అమాయకులు కారని హెచ్చరించారు. కర్ణాటకలో ఇలాంటి హామీలే ఇచ్చి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కరెంటు చార్జీలు పెంచారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే పేరు మార్చి గ్యారెంటీల పేరుతో ప్రకటించారని దుమ్మెత్తి పోశారు. రాహుల్గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.