హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. 2021, జులైలో రాజ్యసభలో ప్రకటించారు. ఈ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు? అని హరీశ్రావు బండి సంజయ్ను ప్రశ్నించారు. దేశం కోసం.. ధర్మం కోసం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
కేంద్రంలో మొత్తం 40 లక్షల 4 వేల 941 ఉద్యోగాలకు గానూ… మార్చి 1, 2020 నాటికి 31 లక్షల 32 వేల 698 మంది మాత్రమే పని చేస్తున్నారు. 8 లక్షల 72 వేల 243 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా రాజ్యసభలో వెల్లడించారు.