హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. రూ. 5 కే భోజనాన్ని అందించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోగుల సహాయకులతో కలిసి మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. భోజనం ఎలా ఉందని రోగుల సహాయకులను హరీశ్రావు ప్రశ్నించారు. భోజన సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వెనుకాడదని మంత్రి స్పష్టం చేశారు.
ఉస్మానియా దవాఖానలో రోగి సహాయకులకు మూడు పూటలా భోజన పథకాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజసింగ్, టి ఎస్ఎమ్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. pic.twitter.com/BMcLonzLru
— Namasthe Telangana (@ntdailyonline) May 12, 2022