సిద్దిపేట : ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గజ్వేల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 368 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
అన్నింటిపై కేంద్రం ధరలు పెంచుతోందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సీఎం కేసీఆర్ పంచితే.. కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచి పేద ప్రజల డబ్బులను లాక్కుంటుందని ఆరోపించారు. పంచే ప్రభుత్వం వైపా.. పెంచే ప్రభుత్వం వైపు ఉందామా? అని ప్రజలే తేల్చుకోవాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని రకాల వైద్యసేవలు ప్రభుత్వ ఆసుపత్రల్లో అందిస్తున్నట్లు చెప్పారు.
గరీబోళ్లు ప్రైవేటు దవాఖానాలకు వెళ్లి డబ్బులు నష్టపోవద్దని, తప్పనిసరైతే తప్పా సిజేరియన్కు వెళ్లొద్దన్నారు. గర్భిణులు, బంధువులు సిజేరియన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తేవొద్దని, సహజ ప్రసవం తల్లీబిడ్డలకు శ్రేయస్కరమన్నారు. పుట్టిన శిశువుకు గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, దాంతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఎదుగుదల సైతం
బాగుంటుందని, పిల్లలు హుషారుగా ఉంటారన్నారు.