Kaleshwaram | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పందించారు. ఈ అంశంపై పార్లమెంట్( Parliament )లో కేంద్రం చేసిన ప్రకటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని హరీశ్రావు గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రాజెక్టులకు( Telangana Projects ) కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వివక్షను ఎండగడుతూ హరీశ్రావు వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను కూడా జతపరిచారు హరీశ్రావు.
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది.
కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ – బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టింది. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం.
కేడబ్ల్యుడిటి-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది. న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించింది. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదు. ఇది రాజకీయ కక్ష కాదా?
CWC accorded approval to the Upper Bhadra Project of Karnataka, a BJP ruled State when KWDT II award was stayed by SC in 2013. CWC accorded clearances to Upper Bhadra Project and GoI also accorded NP status for a project when the whole matter was subjudice
For Kaleshwaram… https://t.co/ZqSs2Ke5TY pic.twitter.com/yMhWsVWaV1
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023