Minister Harish rao | సిద్దిపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నాయని, ఇది కలలో కూడా ఊహించని మహాద్భుతమని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయజెండాను ఆయన ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో దండుగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చార ని అన్నారు. మిషన్ భగీరథతో వంద శాతం ఇండ్లకు తాగునీరిచ్చి దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థా నంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పా రు.
సీఎం కేసీఆర్ దీక్షా దక్షతతో రాష్ట్రం ముందడు గు వేస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసుకోవడంతో రెండు పంట లు పండుతున్నాయని, పంట ఉత్పత్తుల దిగుబడు లు పెరిగాయని తెలిపారు. సాగునీరు, ఉచిత కరెం టు, రైతుబంధు, రైతుబీమా చేయూతతో తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తూ రాష్ర్టా న్ని దేశానికి అన్నపూర్ణగా మలిచారని కొనియాడా రు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీలు, తండాలను పంచాయతీలుగా మార్చి పాలన చేరువ చేశారని వివరించారు. హరితహారం, కంటివెలుగు, పల్లెప్రగతి, పట్టణప్రగతి వంటి వినూత్న కార్యక్రమాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని వివరించారు. కేసీఆర్కిట్, న్యూట్రిషన్ కిట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు ఇలా చెప్పుకుం టూ పోతే తెలంగాణ సంక్షేమ రాజ్యానికి అసలు సి సలు చిరునామాగా మారిందని పేర్కొన్నారు.
దివ్యాంగులకు స్కూటీల పంపిణీ
శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హరీశ్రావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ నా యకులు కూడా ఈరోజు రాష్ట్ర అవతరణ ఉత్సవా లు నిర్వహిస్తున్నారని, వాళ్లకు అర్హత, స్థితిగతి ఉన్న దో లేదో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఉద్యమం లో పదవులకు రాజీనామా చేసేందుకు ఆనాడు వెనుకాడినవారు నేడు తాము కూడా కేంద్రప్రభుత్వం త రపున వేడుకలు జరుపుతామంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే అందుకు కారణం పదవులకే కాదు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన కారణజన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు విజన్ 2020 అని చెప్పుకున్న చంద్రబాబునాయుడు కూడా నేడు తెలంగాణ అభివృద్ధిని పొగుడుతున్నారని చెప్పారు. సమర్థుడైన కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని స్పష్టంచేశారు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశ జీడీపీ కన్నా తెలంగాణ జీడీపీ ఎక్కువ: జగదీశ్రెడ్డి
ప్రగతిపథంలో పయనిస్తూ తెలంగాణకు సూర్యాపేట రోల్ మాడల్గా మారుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వేడుకకు మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీనే ఎక్కువైందని, స్వయంగా కేంద్రం ప్రకటించిన లెక్కలే ఈ విషయాన్ని చెప్తున్నాయని తెలిపారు.
అమరుల త్యాగం మరువలేనిది: నిరంజన్రెడ్డి
రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన అమరుల త్యాగం మరువలేనిదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లో దశాబ్ది వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ముందుగా అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు.
ఎండాకాలంలోనూ నిండుగా చెరువులు: ఎర్రబెల్లి
పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు వ్యవసాయంలో నంబర్ వన్గా ఉన్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం జనగామ కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎండాకాలంలోనూ చెరువులు నిండుకుండలా మారాయని పేర్కొన్నారు.
దేశానికి రోల్మాడల్: కొప్పుల ఈశ్వర్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికి తెలంగాణ రోల్మాడల్గా నిలిచిందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన దశాబ్ది వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిషరించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచనతో తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోల్మాడల్గా నిలుస్తున్నదని తెలిపారు.
దశాబ్దంలో ప్రగతి పరవశం: శ్రీనివాస్గౌడ్
తెలంగాణ ఏర్పడిన పదేండ్లలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని క్రీడలు, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ ఆవరణలో దశాబ్ది వేడుకలకు ఆయన హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ తలసరి ఆదాయం కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నదని వెల్లడించారు.
70 ఏండ్ల అభివృద్ధి 9 ఏండ్లలో..: తలసాని
70 ఏండ్లలో జరగని అభివృద్ధిని 9 ఏండ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ది అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరణ చేసి, మాట్లాడుతూ, తెలంగాణ పథకాలు అమలు చేయాలని ఇతర రాష్ర్టాల రైతులు తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమ సర్కార్: పువ్వాడ
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమ సర్కారు నడుస్తున్నదని అన్నారు.
స్వరాష్ట్రంలోనే ప్రగతి పరవళ్లు: గంగుల
ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణ నేడు ప్రగతి పరవళ్లు తొక్కుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్లోని పోలీసు పరేడ్గ్రౌండ్లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగుర వేసి, అమరులకు నివాళి అర్పించారు.