హైదరాబాద్ : తొలిసారిగా లైన్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడీసీఎల్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్లో తొలిసారిగా లైన్ ఉమెన్గా ఉద్యోగం పొందిన జబ్బూరి శిరీషకు టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి నియామక పత్రాన్ని అందించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలకు ఈ ఉద్యోగాలకు అవకాశం లేదని, గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200పైచీలుకు లైన్ ఉమెన్లను ట్రాన్స్కోలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని ఆరోపించారు.
కరెంటు కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు కేంద్రం కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమావాస్య రోజున హెలీకాప్టర్ వేసుకొని వస్తే దేశంలో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రమన్నారు. బొగ్గు కొరత రాష్ట్రంలో లేదు కానీ, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని అనేక ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు తీసుకొని పోవాలో సీఎం కేసీఆర్ తెలుసునన్నారు.