జగిత్యాల : ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చర్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ను అందజేశారు. కాలనీలలో మురికి కాలువల నిర్మాణానికి రూ.20 లక్షల ప్రొసీడింగ్స్ లను గ్రామ ప్రజా ప్రతినిధులకు అందజేశారు.
వెల్గటూర్ మండలం గొడిషలపేట గ్రామంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల ప్రొసీడింగ్ను, మల్లన్నపేట గ్రామంలో గౌడ సంఘం, యాదవ సంఘం భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ లను అందజేశారు. పనులు శాశ్వతంగా ఉండాలంటే నాణ్యతతో చేపట్టాలని స్థానికులకు సూచించారు.