హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో రేషన్ డీలర్ల జేఏసీ సోమవారం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. దాంతో జూన్ 5 నుంచి తాము చేపట్టబోయే సమ్మెను విరమించుకుంటున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించేందుకు మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఆహ్వానించారు. వారితో చర్చలు జరుపగా రేషన్ డీలర్లు 22 సమస్యలను విన్నవించారు. వీటిపై చర్చించిన మంత్రి.. 20 సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం పెంపు, కమీషన్ పెంపు వంటి అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మంత్రి హామీపై సంతృప్తి చెందిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు.. సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాసర్, పద్మాదేవేందర్రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ వీ అనిల్కుమార్, జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, వైస్ చైర్మన్ బంతుల రమేశ్బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ పాల్గొన్నారు.