హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఇంటర్లో అత్యుత్తమ ఫలితా లు సాధించిన మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సత్కరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకర్లకు నగ దు ప్రోత్సాహాకాలను అందజేశారు. బీసీ గురుకులాల్లో ఇంటర్లో 87శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో 4, 5, 6, బైపీసీలో 6, 7, ఎంఈసీలో 4, 5 ర్యాంకులను గురుకుల విద్యార్థులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. 300 పైచీలుకు విద్యార్థులు 10లోపు ర్యాంకులను పొందడం సంతోషకర విషయమని మంత్రి పేర్కొన్నారు.