రవీంద్రభారతి, మే31: బీసీ విద్యార్థులకు 260 గురుకుల పాఠశాలలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేసవి సాంస్కృతిక సంబురాలు మంగళవారం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
బీసీలు అన్ని రంగాలలో రాణించాలని మంత్రులు కోరారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు కే కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేందర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.