కరీంనగర్ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి వారి వివాహాలకు చేయూతనిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలోనూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.